బాలిక కిడ్నాప్ కలకలం

SMTV Desk 2017-07-18 12:44:57  aarohi,meena,kidnap,hyderabad,

హైదరాబాద్,జూలై 18 : చిలుకానగర్ లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ గురైన సంఘటన కలకలం సృష్టిస్తోంది మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన కమలేష్ నగరానికి వచ్చి టాటా కంపెనీలో పనిచేస్తూ కుటుంబంతో చిలుకానగర్ లో ఉంటున్నాడు. వీరి కూతురు ఆరోహి మీనా(6) స్థానిక నలంద పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుంది. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పిల్లలందరికి చాక్లెట్స్ ఇచ్చి ఆరోహి మీనాను బైక్ పై ఎక్కించుకుని పారిపోయారు. కుమార్తె కనిపించకపోవడం తో చుట్టుపక్కల వారు ఆరోహి కిడ్నాప్ అయినట్లు చెప్పారని కమలేష్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.