పూరి జగన్నాధ్ తో మొదలు

SMTV Desk 2017-07-18 11:49:27  Starting, with, Puri Jagannad

హైదరాబాద్, జూలై 18 : ఇటీవల సినిమా పరిశ్రమలో కొందరు సినీ ప్రముఖులు మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వారికి ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం... నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఎవరు ఏ తేదినా సీట్ కు హాజరు కావాలనే విషయం పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 19 న విచారణ మొదలు కానుంది. ముందుగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఈ విచారణ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. 19 న పూరి జగన్నాధ్, 20 న ఛార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ లు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ విచారణ ఉదయం 10.30 గంటల నుండి మొదలవుతుంది. ఈ విచారణలో వీరు ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారో చూడాలి.