పటియాల, జూలై 15 : ఆడపిల్ల పుట్టిందనే కారణంగా ఓ మహిళ పై అత్తింటివారు కృరంగా ప్రవర్తించారు. ఆమె ను కిందపడేసి కర్రతో దాడి చేసిన సంఘటన పంజాబ్ లోని పటియాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పంజాబ్ లోని పటియాల లో నివాసముంటున్న మీనా కశ్యవ్, దల్జీత్ సింగ్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లను కన్నావని మీనాను అత్తింటివాళ్ళు కొడుతూ, అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెడుతుండే వారని స్థానికులు తెలిపారు. ఆడపిల్లను కన్నావని దల్జీత్ సోదరుడు, అతని స్నేహితుడు మీనాను హాకీస్టిక్ లతో అతి దారుణంగా కొట్టారన్నారు. ఎంత అరిచి గగ్గోలు పెట్టినా విడిచిపెట్టలేదని వివరించారు. అక్కడున్న ఒకరు వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని అరెస్టు చేసారని వారు వెల్లడించారు.