మిత్రుడి పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం

SMTV Desk 2017-07-14 10:03:07  road,accident,devarakadra, Painstaking,Severely,

దేవరకద్ర : జూలై 14 : మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ స్టేజీ సమీపంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఫలక్ నుమాకు చెందిన టైలర్ షేక్ అఫ్రోజ్‌కు చిత్తూరు జిల్లా ములకల్ చెరువు మండలం బి. కొత్తకోటకు చెందిన యువతితో బుధవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికని అఫ్రోజ్‌ స్నేహితులు 10 మంది ఇన్నోవ వాహనంలో బయలుదేరారు. శాఖాపూర్ టోల్‌ ప్లాజా దాటిన కొన్ని క్షణాల్లోనే గుడిబండ స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో, వాహనం అదుపు తప్పి హోటల్ ముందు ఆగి ఉన్న రెండు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ షేక్ మహ్మద్‌ పాషా (27) తో పాటు ముందు సీట్లో కూర్చున్న షేక్ ముబారక్ (22) లు అక్కడి అక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు ఫలక్‌నుమా ప్రాంతవాసులే. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల తెలిపారు సీటులో ఇరుక్కు పోయిన మహ్మద్‌ పాషా మృతదేహాన్ని పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. వెనుక సీట్లో కూర్చున్న షేక్ బాబా (25) బుధవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. స్నేహితుల మృతదేహాలను చూసి రోదిస్తున్న పెళ్లికుమారుడు అఫ్రోజ్ కు ఆయన తల్లిదండ్రు లు సర్దిచెప్పి పెళ్లికి పంపించారు.