బిర్యాని లేదనందుకు దాడి

SMTV Desk 2017-07-12 14:25:59  karnool, arebiyan, hotal, Attack, on, Biryani,

కర్నూల్, జూలై 12 : బిర్యాని లేదన్నందుకు వ్యక్తి పై దాడి చేసిన ఘటన కర్నూల్ నగరంలోని అరేబియన్ హోటల్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... కర్నూల్ లోని అరేబియన్ హోటల్ కి రాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చి 5 బిర్యానీ లు కావాలని ఆర్డర్ చేసారు. అయితే 5 బిర్యానీలు లేవు 2 ఉన్నాయని హోటల్ వర్కర్ రీయాజ్ చెప్పడంతో ఆగ్రహానికి గురై అతని పై దాడికి దిగారు. ఇద్దరు దుండగులు మరి కొంత మందికి ఫోన్ చేసి రప్పించి ఆయుధాలతో రీయాజ్ పై దాడి చేసారు. రీయాజ్ ను కాపాడే క్రమంలో మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన రీయాజ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం రీయాజ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.