నాగ్పూర్, జూలై 10: మహరాష్ట లోని నాగ్పూర్లో కలమేశ్వార్ ప్రాంతంలో వేనే డ్యాంలో ప్రయాణిస్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. వివరాల్లొకి వెళ్తే, పుట్టినరోజు వేడుకల్లో విహార యాత్రకు వెళ్ళిన కొందరు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదు.