కొమురంభీం, జూలై 10 : ఈ రోజు ఉదయం కొమరంభీం ఆసీఫాబాద్ జిల్లాలోని కస్తూర్భా స్కూల్లో సుమారు 100 మంది అల్పాహారం తిన్న బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ జరిగిందని గ్రహించిన ఉపాద్యాయులు వెంటనే వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆస్వస్థతకు గురి కావడంతో అలజడి చెలరేగింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో, జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.