టీచర్ మందలించడంతో ఆత్మహత్య యత్నం

SMTV Desk 2017-07-07 17:28:56  gutka packets, students, bhuupalapally

భూపాలపల్లి, జూలై 07 : భూపాలపల్లి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ లో గుట్కా ప్యాకెట్లు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే కొద్ది నెలలుగా గుడ్ మార్నింగ్ స్కూల్ లోని కొందరు స్టూడెంట్స్ గుట్కా నములుతున్నట్టుగా గుర్తించిన టీచర్లు సందీప్, భార్గవ్ అనే ఇద్దరు విద్యార్థులను పిలిచి మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తామన్నారు. అసలు వారికి ఇవి ఎలా వస్తున్నాయన్న విషయంపై వారు ఆరా తీసారు. దీంతో భయపడిపోయిన సందీప్, దోమల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. వెంటనే అప్రమత్తమయిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లలకు వీటిని సరఫరా చేస్తున్న ముఠాని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.