హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అన్ని వర్గాలు పాలకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్కుమార్, టీజేఎస్ నేతలు అంబటి శ్రీని వాస్, చింత స్వామి, గోపాలశర్మ, భైరి రమేశ్ తదితరులతో కలసి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 29న సరూర్నగర్లో జరిగే జన సమితి ఆవిర్భావ సభకు అన్ని అనుమతులు లభించాయని, దీని కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభ నిర్వహణ కోసం 12 కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. సభా నిర్వహణ నిమిత్తం వాలంటీర్లకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు.