ఖమ్మం, ఏప్రిల్ 22: ఛత్తీ స్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీ స్స్టేషన్ పరిధిలోని పాలోడి సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్కు చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసి ఏఎస్ఐ అనీల్కుమార్ మౌర్య మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్, 208 కోబ్రా దళాలు, డీఆర్జీ పోలీసు దళాలు కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తున్న క్రమం లో ఇరువర్గాల మధ్య కాల్పులు జరగాయి. ఏఎస్ఐ మృతదేహాన్ని కిష్టారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.