హైదరాబాద్, మార్చి 19 : మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలోని ప్రతి విభాగంలో కమిషన్లు బాగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. గతంలో లంచాలు అడిగితే చెప్పుతో కొట్టాలన్న కేసీఆర్.. ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తారో? అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలే కమిషన్ల గురించి బహిరంగంగా మాట్లాడుకు౦టున్నారని అన్నారు. సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రోత్సాహంతోనే తాము కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు తీసుకుంటున్నామని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పావని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.