హైదరాబాద్, మార్చి 19 : శాసనసభ సభ్యత్వం రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల శాఖ తరఫున అడ్వకేట్ జనరల్ ప్రకాశ్రెడ్డి వాదనలు విన్పించారు. ఈ ఉదయం నుండి విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆరు వారాల వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఈసీని ఆదేశించింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటనల దృశ్యాలకు సంబంధించిన సీడీని ఈ నెల 22లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.