హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. టీ యాప్ ఫోలియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీఎంత అభివృద్ధి చెందినా సామాన్యులకు ఉపయోగపడకపోతే లాభముండదని సీఎం కేసీఆర్ చెప్పినట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్న ఆయన పట్టణ ప్రాంతాల్లో సైతం భూరికార్డుల ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.