హైదరాబాద్, ఫిబ్రవరి 25 : టీఆర్ఎస్ కు అధికారం మళ్ళీ రాదంటూ టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్న ఆయన.. ఆ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలంటూ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఇదే ఆఖరి బడ్జెట్ అంటూ చిలక జ్యోస్యం చెప్పారు. కేసీఆర్కు అహంకారం బాగా పెరిగిందని ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బస్సు యాత్ర ద్వారా వివరిస్తామని పేర్కొన్నారు.