హైదరాబాద్, ఫిబ్రవరి 20 : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి సీఈవోగా రజత్కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.