హైదరాబాద్, ఫిబ్రవరి 19 : నగరంలోని మీర్పేట లో ఓ గొలుసును ఇద్దరు దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధి జిల్లెలగూడలోని విజయ హోమ్స్ లో చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం అరుణ కుమారి(58) అనే మహిళ ఇంటి ముందు వాకిలి శుభ్రం చేస్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు దుండగులు ఆమె సమీపానికి వచ్చారు. ఒకడు బైక్పై సిద్ధంగా ఉండగా.. మరొక వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లి మెడలోని 3 తులాల బంగారు పుస్తలతాడును తెంచుకొని ఉడాయించారు. ఆమె గట్టిగా అరుస్తూ దుండగులు వెంట పరుగెత్తడంతో ఓ దుండగుడు బైక్పై వెళ్లిపోగా.. మరో వ్యక్తి చెప్పులు వదిలి పరుగులు తీశాడు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.