విదేశీ పర్యటనకు బయలుదేరిన మోదీ..!

SMTV Desk 2018-02-09 15:49:14  pm modhi, palastina tour, 3 countrys tour,

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. పాలస్తీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ ఈ మూడు దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. పాలస్తీనాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ నేడు ఢిల్లీ నుండి జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ చేరుకొని అక్కడ నుండి పాలస్తీనా నగరమైన రామల్లాలోని అధ్యక్ష నివాసానికి చేరుకుంటారు. కాగా ప్రభుత్వం మోదీ పాలస్తీనా పర్యటనను చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. సోమవారానికి మోదీ పర్యటన ముగియనుంది.