వినోదం.. విషాదంగా ముగిసింది

SMTV Desk 2018-01-27 12:21:22  young person died, cricket playing, anthoni, banjara hills

హైదరాబాద్, జనవరి 27 : అప్పటి వరకు వినోదంగా సాగుతున్న క్రికెట్ ఒక్కసారిగా విషాదంగా మారింది. బంజారాహిల్స్‌లో రోడ్‌ నం.10లో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. జహీరానగర్‌లోని ఖాళీ స్థలంలో క్రికెట్‌ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంథోని(23) అనే యువకుడు బౌలింగ్‌ వేస్తుండగా ఛాతిలో నొప్పితో మైదానంలో హఠాత్తుగా పడిపోయాడు. సహచరులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఫై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.