హైదరాబాద్, జనవరి 13 : ఇసుకను అక్రమంగా తరలి౦చే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక మాఫియాపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం వారికి అందుబాటు ధరలలో ఇసుక లభ్యమయ్యేలా చూడాలని, అలాగే అక్రమంగా ఇసుక తవ్వడం, సరఫరా చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.