హైదరాబాద్, జనవరి 11 : జూబ్లీహిల్స్లో రోడ్డు పనుల నిమిత్తం ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. శ్రీహరి నివాసం నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టనున్న నేపథ్యంలో దాదాపు ఆరు నెలల పాటు ట్రాఫిక్ను మళ్లించారు. కావున వాహనాదారులు ఇది గమనించి జూలై 9 వ తేదీ వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు వెల్లడించారు. > మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ రోడ్ నం.45కి వచ్చే వాహనాలను మహా న్యూస్ ఛానెల్, బీస్ట్రో పబ్, ఫెర్నాండెజ్ ఆసుపత్రి నుంచి రోడ్ నం. 44మీదుగా మళ్లించారు. > మాసాబ్ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.12 మార్గాల్లో వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్నం.10 మీదుగా ఒడిషా ఐలాండ్, జహీరానగర్, క్యాన్సర్ ఆసుపత్రి, ఒడిషా ఐలాండ్ కూడలి మీదుగా రోడ్ నం.12కు చేరుకుని వెళ్లాలి. > బంజారాహిల్స్ రోడ్ నం.13కు మినిస్టర్ క్వార్టర్స్, రోడ్ నం.1 నుంచి వచ్చే వాహనాలకు వన్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి చేరుకోవాలంటే రోడ్ నం.10 మీదుగా జహీరానగర్, ఐలాండ్ క్యాన్సర్ ఆసుపత్రి మార్గాల్లోనే వెళ్లాలి. > జూబ్లీహిల్స్ రోడ్ నం.45నుంచి వచ్చే వాహనాలు ఫిలింనగర్, అపోలో ఆసుపత్రి, బంజారాహిల్స్ రోడ్నం.12 మీదుగా ఒడిషా ఐలాండ్, క్యాన్సర్ ఆసుపత్రి, జహీరానగర్ మీదుగా రాకపోకలు సాగించాలి. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని నగర సీపీ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.