హైదరాబాద్, జనవరి 9 : తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని, వాస్తవాలు మరచి ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను దద్దమ్మలు అంటున్న హరీష్రావు రావు.. తన పక్కన వారినే కుర్చోబెట్టుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్డీఎస్ కోసం ఆమరణ దీక్ష చేసి జైలుకు వెళ్తే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి చెప్పుడు మాటలు విని అభాసుపాలు కావద్దని మంత్రి హరీశ్రావుకు సూచించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి డీకే అరుణతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు డీకే అరుణ ఒక తల్లిలాంటిదని, ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకెప్పుడు చేయొద్దని కోరారు.