హైదరాబాద్, జనవరి 9 : నగరంలో రోజు రోజుకు చెలరేగిపోతున్న దోపిడీ దొంగలు తాజాగా సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరోసారి రెచ్చిపోయారు. షేక్పేట్కు చెందిన యశోద, మల్లేష్ దంపతులు మహబూబాబాద్ వెళ్లేందుకు ఉదయం స్టేషన్కు వచ్చారు. అయితే, కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కుతున్న సమయంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి యశోద మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు మంగళసూత్రం లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ మెడపై స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే బాధితురాలు రైల్వేస్టేషన్లోని జి.ఆర్.పి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.