హైదరాబాద్, జనవరి 7 : ఉత్తర భారతంలో పొగమంచు ఎంతలా ఉందంటే.., నేడు నాలుగు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేసే౦తలా ప్రతికూల వాతావరం నెలకొంది. పొగమంచు కారణంగా విమానాలకు తీవ్ర అంతరాయం నెలకొన్న నేపథ్యంలో ఈ నాలుగు అంతర్జాతీయ విమానాలను శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్కు ఎయిర్పోర్టు అధికారులు అవకాశం కల్పించారు. జెడ్డా-లఖ్నవూ, సౌది అరేబియా-ఢిల్లీ, దుబాయ్-బంగ్లాదేశ్, సింగపూర్- ఢిల్లీ విమానాలు శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి.