సూర్యాపేట, జనవరి 7: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి సమీపంలో జాతీయ రహదారిపై, విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఏపీ 16ఏ 0151 నంబరు గల సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.