గవర్నర్ తో సమావేశమైన టి.కాంగ్రెస్ నేతలు

SMTV Desk 2018-01-05 16:51:43  T.Congress leaders meeting with the governor

హైదరాబాద్, జనవరి 5 : నేడు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ తో టి.కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తో నేతలు పలు విషయాలపై చర్చించారు. అలాగే, తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలపై వినతిపత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. అంతేకాకుండా ఈ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన సాయి అనే వ్యక్తి కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌పై హత్యకేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు తదితరులు హాజరయ్యారు.