నేడు సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక సోదాలు

SMTV Desk 2018-01-04 18:28:36  KTR Sirisilla, development searches

సిరిసిల్ల, జనవరి 4 : నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడి అధికారులకు, ముఖ్య నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్లారు. అయితే, జిల్లాలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. తంగళ్లపల్లి మండలంలోని, మండళ్లపల్లి శివారులో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పరిశీలించి, పనుల జాప్యంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జల్లా కేంద్రం సిరిసిల్లకు వెళ్లి రోడ్ల వెడల్పు పనులు ఎలా జరుగుతున్నాయో గమనించారు.