పట్టపగలే దోపిడీకి తెగ్గించిన దుండగులు

SMTV Desk 2018-01-04 17:22:49  robbery jublehills cc camera, police

హైదరాబాద్, జనవరి 4 : సమాజంలో రోజు రోజుకు మానవత్వం నశించిపోతుంది. రాత్రుల్లోనే కాకుండా పట్టపగలు కూడా దోపిడీ దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో పట్టపగలు దారి దోపిడీ చోటుచేసుకుంది. ఆ మార్గం గుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తితో బెదిరించారు. ద్విచక్రవాహనంతో పాటు అతని వద్ద ఉన్న పర్సు, రెండు ఫోన్లు లాక్కుని పరారయ్యారు. దుండగులను తీవ్రంగా ప్రతిఘటించిన బాధితుడు హెల్మెట్‌ విసిరికొట్టినా వదలకుండా ముగ్గురూ ద్విచక్రవాహనంపై అక్కడినుంచి తప్పించుకున్నారు. దీంతో ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.