హైదరాబాద్, జనవరి 03 : పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజుతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఆమె కోరింది. ఈ మేరకు త్వరలో దానికి సంబంధించిన పరిశీలనకు కేంద్ర బృందాన్ని జిల్లాకు పంపించాల్సిందిగా, కవిత పేర్కొంది. కాగా, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది.