హైదరాబాద్, జనవరి 02 : నూతన సంవత్సర కానుకగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఓ శుభవార్తను అందించింది. 10, 12 తరగతులు పాసైన అభ్యర్థులకు ఇండియన్ రైల్వేస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే, అర్హులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా ఈ నెల 12న సాయంత్రం 5.30గం.లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లలో ఉన్నవారికి జనవరి 22వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. పూర్తి సమాచారం కొరకు http://www.indianrailways.gov.in/index_new.html చూడవచ్చు.