హైదరాబాద్, డిసెంబర్ 31 : హైదరాబాద్ మెట్రో రైలు సాంకేతిక సమస్యతో రెండు గంటలపాటు నిలిచిపోయింది. అమీర్పేట్- నాగోల్ మధ్య మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో అమీర్పేట్ లో నిలిచిన ఈ మెట్రో రైలును ప్రకాష్ నగర్ అదనపు ట్రాక్ పైకి తరలించారు. మళ్లీ రెండు గంటల అనంతరం మెట్రో సేవలను పునరుద్దరి౦చామని మెట్రో అధికారులు వెల్లడించారు. నెలరోజుల నుండి విజయవంతంగా పరుగులు పెడుతున్న మెట్రోలో తొలిసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి.