బీజేపీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సురవరం..

SMTV Desk 2017-12-29 16:47:13  CPI national general secretary Suravaram Sudhakar Reddy, Executive Meetings at the Maghoom Bhavan in hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 29 : ఈ నెల 28 నుంచి రెండు రోజులపాటు మగ్ధూం భవన్‌లో కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అయితే, నేడు జగిన ఈ కార్యవర్గ సమావేశానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలందరికీ బీజేపీ అసమర్థ పాలనపై ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు. పోరాటాల్లో వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర లౌకిక శక్తులను కలుపుకుపోవాలన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ, సామాన్యుల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నేరెళ్ల దళితులపై దాడి ఘటనకు బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు చాడ బహిరంగ లేఖ రాశారు.