హైదరాబాద్, డిసెంబర్ 29: నిరుద్యోగ మైనారిటీ యువతలో నైపుణ్యం పెంపొందించే దిశగా మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ, ప్రిస్మ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. నేటి తరం యువత ప్రధానంగా ఉపయోగించే కంప్యూటర్ హార్డ్ వేర్ లో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిస్మ్ ఎడ్యుకేషనల్ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.