హైదరాబాద్, డిసెంబర్ 28 : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సుమారు 3,000 నుండి 4,000 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ట్రాన్స్కోలో 1100 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం), 330 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 174 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర పడనుంది. ఆయా పోస్టులను గుర్తిస్తూ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు ఫైలుపై సంతకం చేశారు. గత ఏడాదే ముఖ్యమంత్రి కేసీఆర్ 13వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇందు నిమిత్తం ఆయా పోస్టుల భర్తీకి ఆమోదం కోసం విద్యుత్ సౌధలో నేడు విద్యుత్ సంస్థల బోర్డులు సమావేశం కానున్నాయి.