హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణాలోని ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ )105 వ సమావేశం కొన్ని అనివార్య కారణాల వలన వాయదా పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ ఛాన్స్ ను మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ కొట్టేసింది. ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓయూ తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాలు పోటీ పడ్డాయి. అయితే మణిపూర్ విశ్వవిద్యాలయం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. అసోసియేషన్ అధికారులు మాట్లాడుతూ ..."105వ ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి రిజిస్ట్రేషన్ ఫీజును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం" అని వెల్లడించారు.