నిజామాబాద్, డిసెంబర్ 25 : దాంపత్య జీవితంలో కొన్ని కారణాల వలన భార్య విడాకులు ఇచ్చిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీంగల్ మండలంలోని బడా భీంగల్ రాజు (27) అనే వ్యక్తి తన భార్య చిన్న చిన్న కారణాలకే విడాకులు ఇచ్చిందని మనస్థాపానికి గురై, దాదాపు 80 రకరకాల మాత్రలు మింగేశాడు. స్పృహలో లేని అతనిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.