హైదరాబాద్, డిసెంబర్ 25 : పురాతన గోల్కొండ కోట ఆదివారం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో 3 వేల నుంచి 4 వేల మంది కోటను సందర్శిస్తారు. వారాంతాల్లో 5 వేల నుంచి 9 వేల వరకు పర్యాటకులు వస్తారు. కానీ ఈ ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు కోటకు వచ్చి సందర్శించారు. అయితే, క్రిస్మస్ సందర్భంగా పర్యాటకులు అధిక సంఖ్యలో కోటకు వచ్చినట్లు ఇన్ఛార్జి భానుప్రకాశ్ తెలిపారు. పర్యాటకులు విచ్చేయడంతో కోట వద్ద ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కోటకు చేరుకునే రామ్దేవ్గుడా వద్ద ట్రాఫిక్ పోలీసులు పర్యాటక బస్సులను నిలిపివేశారు. బస్సులను లోనికి అనుమతించలేదు. పర్యాటకులు దాదాపు 2 కి.మీ దూరంలో ఉన్న కోటకు నడుచుకుంటూ చేరుకున్నారు. ఆదివారం మొత్తం 18,060 మంది పర్యాటకులు కోటకు సందర్శించి రికార్డు సృష్టించాడు.