హైదరాబాద్, డిసెంబర్ 21 : 2017 సంవత్సరంలో ఈ రోజు భయకరమైందని పాశ్చాత జ్యోతిష్కులు అంటున్నారు. 350 ఏళ్ళలో మొదటిసారి సూర్యుడు, శని ఒకే రాశిలోకి రావడం ప్రళయ సంకేతమని నీల్ స్పెన్సర్ అనే జ్యోతిష్కుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాదిలోనే అతి తక్కువ పగటి కాలం డిసెంబరు 21 న నమోదవాడమే, అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదంటున్నారు కొందరు విశ్లేషకులు. క్రీ.శ.1664 తర్వాత ఇలాంటి ఖగోళ మార్పు ఈ రోజు సంభవిస్తుందని స్పెన్సర్ వివరిస్తూ... వ్యక్తుల జాతకంలో శని మకరంలో ప్రవేశిస్తే లాభదాయకమన్న ఆయన, ఖగోళపరంగా స్థూల స్థాయిలో ఇది ప్రమాదకరమైన విషయమని వెల్లడించారు. అంతేకాదు నేడు ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని, ఒకవేళ తీసుకుంటే వాటి ప్రభావం 2018లో కూడా చూపిస్తుందని అనేక ప్రముఖ ఆస్ట్రాలజీ వెబ్సైట్లు కూడా ప్రకటించాయి.