ఒకే దేశం ఒకే ఎన్నికలకు మేము వ్యతిరేకం : సురవరం సుధాకర్‌రెడ్డి

SMTV Desk 2017-12-19 15:16:49  cpi, suravaram sudhakar reddy, jameli elections, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వం.. దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు జరిపే దిశగా పావులు కదుపుతుంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలను సహకరించమని కూడా ప్రధాని మోదీ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విధానంపై సుముఖత తెలిపింది. కాగా ఈ విషయంపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురంవరం సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. "దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు మా పార్టీ వ్యతిరేకం. రాష్ట్రాల హక్కులను నియ౦త్రించేందుకు ఈ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆదివాసీలు-లంబాడీల సమస్యకు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే కారణం. వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను బదిలీ చేయడం భావ్యం కాదు" అని వ్యాఖ్యానించారు.