హైదరాబాద్, డిసెంబర్ 17 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల ఉమ్మడి ఉప లోకాయుక్త టి. గంగిరెడ్డి(63) కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు శనివారం గుండెపోటు వచ్చి మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఈయన 1954 జూలై 12న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి హయంలో ఉప లోకాయుక్తగా నియమితులయ్యారు. గంగిరెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.