బాలుడి మృతి ఓ మిస్టరీ...

SMTV Desk 2017-12-14 11:59:47  murder, hyderabad, musheerabad

హైదరాబాద్, డిసెంబర్ 14 : నాలుగేళ్ళ బాలుడి మృతి మిస్టరీగా మారింది. చుట్టూ పక్కల సన్నిహితులు, బంధువుల మధ్య ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారిని చంపిందెవరు..? అనే విషయం తెలియాల్సి వుంది. అసలు జరిగిందేమిటంటే.. ముషిరాబాద్ బకారంలో నివసిస్తున్న పరమేశ్వర్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కౌషల్(4) ఆడుకోవడానికి బయటికి వచ్చాడు. ఈ నెల 12వ తేది నుండి చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల వెతుకుతున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తమ ఇంటి పక్కన ఉన్న బిల్డింగ్ పై తమ కుమారుడు కౌషల్.. విగతజీవిగా పడి ఉండడం చూశారు. బాలుడి మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్న౦టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు..? అయినవాళ్ళే ఈ దారుణానికి పాల్పడ్డారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.