ఆమనగల్లు, డిసెంబరు 10 : కల్వకుర్తి నియోజక వర్గానికి సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా జూపల్లి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రంలో మరో పదేళ్లు టీఆర్ఎస్దే అధికారమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.