ఆర్మూరు, డిసెంబర్ 10 : దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు మైనార్టీల పట్ల ఎంతో వివక్ష చూపించాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మైనార్టీల సంక్షేమానికి సహకరిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు రెవిన్యూ దస్త్రాల ప్రక్షాళన చేసి విపక్ష చూపించాయి తప్పా, రైతులకు ఏ మాత్రం ఉపయోగం చేకూరేలా సర్వే చేయలేదని ఆయన విమర్శించారు.