ఏటూరునాగారం, డిసెంబర్ 07 : కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నిమిత్తం ఇటీవల కరీంనగర్ చేరుకున్న కేసీఆర్ అక్కడి నుండి భూపాలపల్లి చేరుకున్నారు. జిల్లాలోని తుపాకుల గూడెంలో పర్యటించిన ఆయన ఆనకట్ట నిర్మాణ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులు నత్తనడకన సాగుతున్నాయ౦టూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ పరిశీలనకు మళ్ళీ 15 రోజుల్లో వస్తానని ఈ లోగా పనులలో పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు, ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు.