హైదరాబాద్, డిసెంబర్ 07 : పోలీసులు తమ విధి నిర్వాహణలో విజయం సాధించడంలో టీం వర్క్ ఎంతగానో ఉపయోగపడిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్) ఘన విజయంపై ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఆ లేఖలో "జీఈఎస్ సదస్సు నిర్వహించడం తేలికైన విషయం కాదు. సమిష్టి కృషితో సమర్థవంతంగా నిర్వహించారు. జీఈఎస్ విజయవంతం కావడంలో ప్రతి విభాగంతో పాటు పోలీసుల పాత్ర చాలా కీలకం. వారిని నా నుండి ప్రత్యేకమైన అభినందనలు" అంటూ వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంలో హైదరాబాద్ పోలీసులు ఘన విజయ౦ సాధించారంటూ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అభినందించిన విషయం తెలిసిందే.