హైదరాబాద్, డిసెంబర్ 06 : రైతులకు త్వరలో హై సెక్యూరిటీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అత్యంత భద్రతతో, టాంపరింగ్ ప్రూఫ్గా "ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకాన్ని" తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే ప్రయోగాత్మకంగా చేపట్టిన పలు పాస్ పుస్తకాలు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ భద్రత కోసం జాతీయ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సహకారం తీసుకోవాలని ప్రభుత్వ౦ నిర్ణయించింది. ఒకవేళ అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే 2018వ సంవత్సరం మొదటి నెలలోనే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.