మేడ్చల్ జిల్లాలో గంజాయి కలకలం

SMTV Desk 2017-12-04 15:37:32  cannabis transport, illegal, medchal, three vctims

మేడ్చల్, డిసెంబర్ 04 : జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండల జాతీయ రహదారిపై కార్లలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ. 36 లక్షల విలువ చేసే 292 కిలోల గంజాయిని శనివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన శ్రీధర్‌, ఖమ్మం జిల్లాకు చెందిన వీర్రాజు, రమణరావుతో కలిసి మూడు కార్లలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పాడేరు నుంచి గంజాయిని తరలిస్తుండగా, ఘట్‌కేసర్‌ పరిసరాలలో పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. అయితే వీరికి గంజాయి ఎక్కడనుండి వస్తుంది..? ఎవరు సరాఫరా చేస్తున్నారో...? తదితర విషయాలపై ద్యరాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.