భూపాలపల్లి, డిసెంబర్ 04 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి తన నిరాడంబరతను ప్రదర్శించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇటీవల మంగపేట మండలం గిరిజన గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో కలెక్టర్ మురళి బస చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ గిరిజన యువకుడు క్షౌరం చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన కలెక్టర్ బాగా చేశావని అతనిని మెచ్చుకున్నారు. అనంతరం తనకు కూడా క్షౌరం చేయాల్సిందిగా ఆ యువకుడిని కోరారు. తనకు క్షౌరం చేసిన౦దుకు గాను రూ. 100 ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నాయీబ్రాహ్మణులు క్షౌరశాలలను పెట్టనివ్వరని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ సమస్యపై పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీనిచ్చారు.