హైదరాబాద్, డిసెంబర్ 04 : హైదరాబాదులో ఇటీవల నిర్వహించిన జీఈఎస్-2017 సదస్సుకు అమెరికా అధ్యక్ష కుమార్తె ఇవాంకా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె భారీ భద్రతతో తన సొంత కాన్వాయ్ లో నగరంలో అడుగుపెడతారని ఊహాగానాలు వినిపించాయి. కాని వీటన్ని౦టికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిగా నగరానికి విమానంలో విచ్చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా సీక్రెట్ ఏజెంట్ ఆమెపై పలు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిలాగే ఇవాంకాకు అంత గొప్ప పేరు లేదని, ఫేక్ అని పేర్కొంటారని తెలిపారు. అంతేకాకుండా ఇవాంకాకు చెందిన కంపెనీ ఉత్పత్తులకు తమ సంస్థల్లో విక్రయించే అర్హత లేదని పలు కంపెనీలు నిషేధించాయట. అలాంటి ఇవాంకకు భారత్ లో ఇచ్చే గౌరవం చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని వెల్లడించాడు.