సభా వేదిక పేరు "శ్రీకాంతాచారి" : కోదండ‌రామ్

SMTV Desk 2017-12-02 16:53:13  koluvulakai kotlata, TEJAC chairman Pro. Kodandaram, saroornagar,

హైదరాబాద్, డిసెంబర్ 02 : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల పేరిట ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కిందని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండ‌రామ్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టనున్న "కొలువులకై కొట్లాట" అనే సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కోదండ‌రామ్ మరో ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 04 వ తేదీన స‌రూర్‌న‌గ‌ర్‌లో నిర్వహించనున్న సభా ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణం అని, సభా వేదికకు శ్రీకాంతాచారి వేదిక అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోదండ‌రామ్ మాట్లాడుతూ.. "ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం తీరు సరిగా లేదు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఇప్పుడు నేను నిర్వహించనున్న సభకు ప్రతిపక్ష నేతలు సైతం హాజరుకానున్నారు" అని తెలిపారు.