వైద్యం వికటించి గర్భిణి మృతి..

SMTV Desk 2017-12-02 16:30:32  RMP doctor treatment, women died, nizamabad yerutla.

నిజామాబాద్, డిసెంబర్ 02 : ఆర్ఎంపీ వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఏర్గట్లకు చెందిన భూలక్ష్మి అనే మహిళ ఆపరేషన్ కోసం ఆర్మూరుకు చెందిన ఆర్ఎంపీ లక్ష్మణ్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేసేందుకు లక్ష్మణ్ ప్రయత్నించగా వైద్యం వికటించి ఆమె మృతి చెందింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా భూలక్ష్మి మృతిపై ఆమె తరపున బంధువులు ఆందోళన చేపట్టారు.